వృద్ధులు బూస్టర్‌ డోస్‌ వేయించుకోవాలి

జూబ్లీహిల్స్‌,మార్చి27: సీనియర్‌ సిటిజన్‌లకు జీహెచ్‌ఎంసీ అందిస్తున్న ‘బూస్టర్‌’ వాహన సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఏఎంఓవోహెచ్‌ డాక్టర్‌ బిందుభార్గవి సూచించారు. ముఖ్యంగా ఇంటినుంచి రాలేనివారు సమాచారం ఇస్తే వైద్య సిబ్బంది ఈ వాహనంలో వచ్చి బూస్టర్‌ వ్యాక్సిన్‌ ఇస్తారని తెలిపారు. యూసుఫ్‌గూడ సర్కిల్‌లో వృద్ధులకు జీహెచ్‌ఎంసీ వాహనంలో ఇంటివద్దకు వెళ్లి బూస్టర్‌ టీకాలు వేస్తున్నట్లు పేర్కొన్నారు. మొదటి, రెండు డోస్‌లు తీసుకుని 90 రోజులు పూర్తైన సీనియర్‌ సిటిజన్లు విధిగా బూస్టర్‌ డోస్‌ వేయించుకోవాలన్నారు. ఇందుకుగాను జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడ సర్కిల్‌ డీఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్‌ వాహనాల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Post a Comment

 
Top